మరో ప్రతిష్టాత్మక ఫిట్​నెస్​​ రన్​ కు వేదిక కానున్న హైదరాబాద్​!

Mar 27, 2026 - 18:32
Mar 27, 2026 - 18:36
 0  2
మరో ప్రతిష్టాత్మక ఫిట్​నెస్​​ రన్​ కు వేదిక కానున్న హైదరాబాద్​!

మరో ప్రతిష్టాత్మక ఫిట్​నెస్​​ రన్​ కు వేదిక కానున్న హైదరాబాద్​!

SHTV Desk: హైదరాబాద్​ నగరం మరో ప్రతిష్టాత్మక ఫిట్​నెస్​​ రన్​ కు వేదిక కానుంది. డీపీఎస్​, పల్లవి గ్రూప్​ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నెక్లెస్​ రోడ్డు పీపుల్స్​ ప్లాజాలో మార్చి  29న భారీ స్థాయిలో యువ భారత్​ రన్​ జరగనుంది. ఫిట్​ ఇండియా లక్ష్యంగా డీపీఎస్​, పల్లవి గ్రూప్​ విద్యాసంస్థల సీఈవో మల్క యశస్వి ప్రత్యేక చొరవతో ఈ రన్​ జరుగుతోంది. 'ది నైల్ మైల్' వ్యవస్థాపకుడైన అనంత్ సంజీవ్ దూగర్ సారథ్యంలో నిర్వహిస్తున్న ఈ రన్​ లో స్కూల్​ విద్యార్థులు​, కాలేజీ స్టూడెంట్స్​, యువత అంతా కలిసి దాదాపు12 వేల మందికి పైగా పాల్గొనబోతున్నారు. 5km, 2km, 500m మూడు కేటగిరీల్లో సాగే ఈ రన్​లో జుంబా, యోగా, మెడిటేషన్​, ప్లేజోన్​ తదితర యాక్టివిటీస్​ కూడా ఉన్నాయి. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0